*1.* భగవద్గీతను లిఖించినదెవరు? =విఘ్నేశ్వరుడు

. *2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము? = భీష్మ పర్వము. 


*3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును? =మార్గశిర మాసము.


 *4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును? =హేమంత ఋతువు. 


*5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను? = వసంత ఋతువు. 


*6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను? =శ్రీకృష్ణుడు అర్జునునికి. 


*7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను? =కురుక్షేత్ర సంగ్రామము.


 *8.* భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను? =కౌరవ పాండవులకు.


 *9.* పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను? =అర్జునుడు.


 *10.* వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను? =సామవేదము.


 *11.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి? =పాంచజన్యము. 


*12.* భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు? =పద్దెనిమిది (18)


 *13.* “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు? = వినోబా భావే. 


*14.* “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు? = మహాత్మా గాంధీ. 


*15.* భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు? = సంజయుడు.


*16.* సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? =కుమారస్వామి. 


*17.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి? =దేవదత్తము. 


*18.* భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి? =

ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)


 *19.* భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు? =

నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.


 *20.* ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? = శ్రీరామచంద్రుడు.


 *21.* భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు? =

అచ్యుత, అనంత, జనార్ధన.


*22.* భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు? =

ధనుంజయ, పార్ధ, కిరీటి.


*23.* శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను.

ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి? =గీతా గానం. 


*24.* “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు? =ఎడ్విన్ ఆర్నాల్డ్. 


*25.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి? =పౌండ్రము. 


*26.* ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? =శంకరుడు.


 *27.* “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు? =మహాత్మాగాంధీ.


*28.* భగవద్గీత ఏ వేదములోనిది? =పంచమ వేదం-మహాభారతం.


 *29.* భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది? =11వ అధ్యాయము 


*30.* ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? =విష్ణువు


 *31.* భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి? =అర్జున విషాద యోగము. 


*32.* భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు? =పదివేలమంది. 


*33.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి? =అనంతవిజయము. 


*34.* భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది? =

“ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది. 


*35.* ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు? =సంజయుడు.


 *36.* భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు? =దృష్టద్యుమ్నుడు. 


*37.* ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను? = వజ్రాయుధము.


*38.* మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి? =వజ్ర వ్యూహం


. *39.* గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు? =భీష్ముడు.


 *40.* సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను? = వాసుకి. 


*41.* అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను? = అనంతుడు.


 *42. * మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి? =సుఘోషము.


 *43.* అర్జునుని ధనస్సు పేరేమిటి? =గాండీవము.


 *44.* జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను? =

నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి) 


*45.* నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? = గంగానది. 


*46.* ఆత్మ యెట్టిది? =నాశరహితమైనది. 


*47.* కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు? =నిష్కామ కర్మ. 


*48.* మనుజునకు దేనియందు అధికారము కలదు? =కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)


 *49.* అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను? =స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.) 


*50.* వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను? = రావిచెట్టు. 


*51.* పంచభూతములచే నాశనము పొందనిది ఏది? =ఆత్మ.


*52.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి? =మణిపుష్పకము.


*53.* ప్రపంచమున పూర్ణానందమెచట లభించును? =ఆత్మయందు.


*54.* మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు? =హనుమంతుడు.


*55.* పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? = గరుత్మంతుడు.


*56.* ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును? =తాబేలు.


*57.* కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా? =చేయుటయే మేలు.


*58.* బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి? =

యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)


*59.* వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను? =లోక క్షేమం కొరకు.


*60.* ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను? = కామధేనువు.


*61.* స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది? =స్వధర్మము.


*62.* పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును? =కామము చేత.


*63.* దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు? =

కామము యొక్క ప్రేరణచే.


*64.* భగవంతుడెపుడు అవతరించును? =ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.


*65.* అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? = ప్రహ్లాదుడు.


*66.* గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? = చిత్రరథుడు.


*67.* హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు? =జ్ఞానతపస్సు.


*68.* జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి? =పరమశాంతి.


*69.* ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు? =

గాలిలేనిచోట గల దీపంతో.


*70.* ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు? =అభ్యాసము, వైరాగ్యము.


*71.* భయంకరమైన మాయను దాటుట ఎట్లు? =భగవంతుని శరణుపొందుట వలన.


*72.* భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను? =

నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)


*73.* భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు? =అజ్ఞానులు.


*74.* విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది? =బ్రహ్మవిద్య.


*75.* మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? = భృగు మహర్షి.


*76.* బ్రహ్మవిద్యకు అర్హత యేమి? =హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.


*77.* ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది? =పరమాత్మయందు.


*78.* గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు? =పరమాత్మయందు అనన్యభక్తిచే.


*79.* ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు? =భగవంతుని భక్తుడు.


*80.* సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు? =

సాక్షాత్తు పరమాత్మయే.


*81.* ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? =మనస్సు.


*82.* పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను? =మేరువు.


*83.* పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? =బృహస్పతి.


*84.* వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? =ఓం కారము.


*85.* యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను? =జప యజ్ఞము.


*86.* ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? = ఐరావతము.


*87.* గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? = ఉచ్ఛైశ్శ్రవసము.


*88.* శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను? =

మూడు (సాత్విక, రాజస, తామసాహారము)


*89.* దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? = నారదుడు.


*90.* సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? =కపిల మునీంద్రుడు.


*91.* భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి? = మోక్షసన్యాస యోగము.


*92.* లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? = కాలము.


*93.* జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను? = మొసలి.


*94.* ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి? =

సత్త్వ, రజ, తమో గుణములు.


*95.* వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను? = వాయువు.


*96. * భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను? = 35.


*97.* విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను? = ఆధ్యాత్మ విద్య.


*98.* రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను? = వాదము.


*99.* అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను? = "అ"-కారము.


*100.* భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను? = అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)


*101.* మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను? = మార్గశిరము.


*102.* క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు

మొత్తము ఎన్ని చెప్పబడెను? = 20 (ఇరువది).


*103.* శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను? = 26 (ఇరువదియాఱు).


*104.* శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను? = 6 (అఱు).


*105.* తపస్సులెన్ని రకములు? = మూడు (శారీరక, వాచిక, మానసిక)


*106.* పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు? = మూడు (ఓమ్, తత్, సత్).


*107.* మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా? = లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.


*108.* సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను? =వేదవ్యాసుడు. 🙏💐


No comments: